నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో డిసెంబర్ మాసానికి సంబంధించి రూ.713 కోట్లు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు డిసెంబర్ మాసానికి సంబంధించిన రూ.713 కోట్ల బిల్లులు బుధవారం విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలకు ప్రతినెల రూ 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని గతంలో ప్రజా ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత ఆగస్టు మాసం నుంచి ప్రతినెల కనీసంగా 700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. విడుదల చేసిన బిల్లులో ఉద్యోగుల గ్రాట్యూటీ, జిపిఎఫ్, సరెండర్ లీవులు అడ్వాన్స్ లకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి.
ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.713 కోట్లు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



