- Advertisement -
టీఎన్జీవోల కేంద్ర సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీవోల కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఏ.హుస్సేన్ ముజీబ్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. సీఎస్ను కలిసిన వారిలో ఆ సంఘం అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.
- Advertisement -



