మాజీ మంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సన్నాల బోనస్కు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.1,161 కోట్లను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సన్ఫ్లవర్ రైతుల పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని కోరారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా విడుదల చేయలేదని విమర్శించారు. 4.01 లక్షల మంది రైతుల నుంచి 23.22 లక్షల టన్నుల సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బోనస్ చెల్లించలేదని తెలిపారు. సన్ఫ్లవర్ కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్బాలు పలికిన మంత్రి ఇప్పటికీ రైతుల ఖాతాలో జమ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెడుతున్న గోసను తట్టుకోలేక ప్రతి చోట రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. 50 శాతం రైతులకు రుణమాఫీ అందలేదనీ, వానాకాలం రైతుభరోసా ఎగ్గొట్టారనీ, యాసంగిలో సగం మందికి కూడా ఇవ్వలేదనీ, రైతుభరోసాను ఎన్నికలకు ముందు రూ.15 వేలు అని చెప్పి రూ.12 వేలకు పరిమితం చేశారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలు, చేతగానితనం, నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
పెండింగ్ సన్నాల బోనస్ రూ.1,161 విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES