Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి

పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి

- Advertisement -

ఈనెల 30న జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్
నవతెలంగాణ – అచ్చంపేట
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని డిగ్రీ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని అని వారు అన్నారు. ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 15% నిధుల పైన విద్యా రంగానికి కేటాయిస్తామని చెప్పి విద్యార్థులు మోసం చేసింది అని వారు అన్నారు.

 కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున  విద్యార్థులతో ర్యాలీ నిరసన కార్యక్రమం చేశారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుంటే భవిష్యత్తులో ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ప్రవీణ్, శివ, తరుణ్, విజయ్, తదితరులు  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -