Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వదంతులతో ప్రజల భయాందోళన..

వదంతులతో ప్రజల భయాందోళన..

- Advertisement -

– పులి సంచరిస్తుదంటూ సామాజిక మాద్యమాల్లో తప్పుడు వార్తలు
– తప్పుడు వార్తలపై చర్యలు తప్పవంటూ అటవీశాఖాధికారుల హెచ్చరిక 
నవతెలంగాణ-బెజ్జంకి : కోహెడ మండలంలోని ఆరేపల్లి,సింగారాయ ప్రాజెక్టు గుట్టల్లో పులి కదలికలున్నాయని..పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.అటవీశాఖాధికారుల హెచ్చరికలను అసరాగా చేసుకుని కొందరు మండలంలోని రేగులపల్లి గ్రామ శివారులోని మల్లం చెరువు ప్రాంతంలో పులి సంచరిస్తుందని తప్పడు వార్తలను సామాజిక మాద్యమాల్లో వైరలవ్వడంతో మండలంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మండలంలో పులి సంచరిస్తుందని వచ్చిన వార్తపై హుస్నాబాద్ డివిజన్ అటవీశాఖాధికారి గోపాల్ రెడ్డిని బుధవారం వివరణ కోరగా కోహెడ మండలం ఆరేపల్లి,సింగారాయ ప్రాజెక్ట్ ప్రాంతంలో పులి కదలికలున్నాయని..తప్పుడు వార్తలను సామాజిక మాద్యమాల్లో వైరలు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -