– డోంగ్లి తహసిల్దార్
నవతెలంగాణ-మద్నూర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాతంలో నుండి ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో ఉన్నందున అత్యవసర పరిస్థితుల దృష్ట్యా నిజాంసాగర్ వరద గేట్ల ద్వార నీటివిడుదల చేయనున్నామని డోంగ్లి మండల తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. నిజాంసాగర్ నీటిపారుదల శాఖ జారీచేసిన సమాచారం మేరకు మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండగలరని సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా ఆయన ప్రజలకు తెలియజేశారు. అధికారుల సూచనలు పాటించి మంజీరా నది వైపు వెళ్లకూడదని ఆయన కోరారు. రాత్రి తొమ్మిది గంటలకు వరద గేట్లు వదిలే సూచన ఉన్నందున డోంగ్లి మండలంలోని మంజీరా నది పరివాహక గ్రామాలైన కుర్లా, మాదన్ ఇప్పర్గా, సిర్పూర్, తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు.
మంజీరా నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES