Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముంపు ప్రాంత ప్రజల అప్రమంతంగా ఉండాలి: పసర ఎస్ఐ

ముంపు ప్రాంత ప్రజల అప్రమంతంగా ఉండాలి: పసర ఎస్ఐ

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ కమలాకర్ అన్నారు. గురువారం మండల ప్రజలకు వర్షాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. మండలంలో ఎడ‌తెరిపి లేకుండా  కురుస్తున్న వ‌ర్షాలకు వాగులు వంక‌లు ప్ర‌హిస్తున్నాయ‌ని, గుండ్ల వాగు ప్రాజెక్టు లోకి 25 అడుగులు గల నీటి సామర్థ్యం కి ఇప్పటికే 24 ఫీట్లు వరద నీరు వచ్చి చేరింది, ఇంక పై నుండి వరద నీరు వచ్చి చేరుతుంది.  ప్ర‌వాహం పెరుగుతుండ‌డంతో ముంపు ప్రాంత ప్ర‌జ‌లు  నిత్యం అప్ర‌మ‌త్తంగా ఉండాలి, ఎవరు కూడా చేపల వేట కి వెళ్ళద్దు, వర్షం తగ్గే వరకు పశువులని, మేకలని ఇంటి దగ్గరే మేపుకోవాలని పస్రా ఎస్సై కమలాకర్ అన్నారు. 

ముంపు ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి , అత్య‌వ‌స‌రమైతే  వెంట‌నే సుర‌క్షిత ప్రాంతాల‌కు తరలి రావాలి. ముంపు ప్రాంత ప్ర‌జ‌లు ప్ర‌మాదం అనిపిస్తే వెంట‌నే డ‌య‌ల్ 100 లేదా పస్రా పోలీస్ స్టేషన్ నంబర్స్ 8712670085, 8712670086 ద్వారా పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని లేదా ఎత్తైన సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -