Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోంథా తుఫాన్ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

మోంథా తుఫాన్ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

- Advertisement -

– జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి..
నవతెలంగాణ – ఊరుకొండ 

రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మోంథా తుఫాన్ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి కోరారు. బుధవారం జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి.. నవతెలంగాణ తో మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈదురు గాలులు మరియు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. రైతులు పాడి పశువులను కూడా సురక్షితమైన ప్రాంతాల్లో  ఉంచాలని.. వ్యవసాయ పొలాల్లో ఉండే రైతులు వర్షాలు కురుస్తున్న సమయంలో సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని.. బోరు బావి మోటార్లు వేయడం గాని కరెంటు పోల్స్ మరియు స్తంభాల వంటి ప్రాంతాలలో ఉండకూడదని పేర్కొన్నారు.

అలాగే గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్న ప్రజలు వర్షాలు కురుస్తున్న సమయంలో కరెంటుకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ను, తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని తెలిపారు. చిన్న పిల్లల్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడాలని.. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాలలోని ప్రజల అప్రమత్తంగా  ఉండాలన్నారు. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వీలైనంత సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -