Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ ఫామ్ గురించి ప్రజలకి అవగాహన కల్పించాలి

ఆయిల్ ఫామ్ గురించి ప్రజలకి అవగాహన కల్పించాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
: రైతులకి ఆయిల్ పామ్ ద్వారా అత్యధిక లాభాలు వస్తాయని ప్రజలకి నమ్మకం కల్గించేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. శనివారం కలెక్టర్ ఛాంబర్ నందు ఉద్యానవన అధికారులు, పతంజలి కి చెందిన అధికారులతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగు పై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీలలో మొక్కలకు నీరు ఎక్కువగా సరఫరా చేసి మంచిగా పెంచాలని, 15 రోజులలో ఇప్పటికే ఆసక్తి చూపిన రైతులకి చెందిన 800 ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకి ఆదేశించారు.అలాగే రైతులకి డ్రిప్ట్ ఇరిగేషన్ కొరకు డి డి లు త్వరగా తీపించాలని, ఎవరైనా ఆర్థిక సమస్య ఉన్న రైతులుంటే వారికి సహకార బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించి డ్రిప్ట్ ఇరిగెషన్ కొరకు డి డి లు తీపించాలని తెలిపారు.

రైతులకి ఇప్పటికే పంట చేతికి వచ్చిన ఆయిల్ పామ్ తోటలకి తీసుకెళ్లి ఆ రైతుల ద్వారా నూతన రైతులకి అవగాహన కల్పించాలని అన్నారు.ఆయిల్ పామ్ సాగుపై రైతుల సందేహాలు నివృత్తి చేయుటకి ఒక కాల్ సెంటర్, మొబైల్ యాప్ ఏర్పాటు చేయాలని దాని ద్వారా రైతులకి సూచనలు ఇవ్వాలని సూచించారు.జిల్లాలో ఇప్పటికే 4740 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు అవుతుందని 2025-26 సంవత్సరంలో జిల్లాలో నూతనంగా 3000 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని జులై చివరి నాటికి రైతులని గుర్తించాలని ఆదేశించారు.

ఆయిల్ పామ్ గెలల సేకరణ కేంద్రం రైతులందరికి అందుబాటులో ఉండేలా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ రైతులకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య, ఉద్యానవన టెక్నీకల్ అధికారి మహేష్, మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ నరేష్,పతంజలి కంపెనీ అధికారులు యాదగిరి, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -