Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దు: ఏపీఎం భూమేశ్వర్ గౌడ్    

దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దు: ఏపీఎం భూమేశ్వర్ గౌడ్    

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని ఐకెపి ఎపిఎం భూమేశ్వర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు మండలంలోని చేపూర్ గ్రామములో బుధవారం వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సన్న వడ్లకి క్వింటాల్ కి 2,389 రూపాయలను రైతులకు చెల్లిస్తుందన్నారు.  రైతులు పండించిన పంట చివరి గింజా వరకు కొంటామని వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, విడిసి అధ్యక్షుడు సారంగి శ్రీకాంత్ ,సీసీ ప్రవీణ్ ,సి ఎ అనిత. సింధుకర్ అమల. మాజీ ఉప సర్పంచ్ లు నడుకూడా శ్రీనివాస్ రెడ్డి, కటికే శ్రీనివాస్  ,న్యాయవాది చేరణ్, మాజీ వార్డు మెంబర్ సభ్యుడు రాజు ,వి డి సి కోశాధికారి  కొండ్రా రంజిత్ ,భూమన్న., రాము ఇందిరమ్మ కమిటీ అధ్యక్షుడు బద్దం రాజు  ఓబీ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -