- Advertisement -
నవతెలంగాణ – కాళేశ్వరం: సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తారు. దీంతో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మద్దుపల్లి- కాళేశ్వరం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాళేశ్వరానికి సమీపంలో 8 కి.మీ మేర వాహనాలు స్తంభించాయి. 4గంటలుగా ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్లో స్తంభించడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు.
- Advertisement -