Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం..

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం..

- Advertisement -

తహసీల్దార్ చంద్రశేఖర్..
నవతెలంగాణ – బెజ్జంకి
: ధరణితో ఎదురైన సమస్యలను భూ భారతి చట్టంతో శాశ్వతంగా పరిష్కారమవుతాయని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని ముత్తన్నపేట, తిమ్మాయిపల్లి గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. అయా గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుమారు 72 అర్జీలను స్వీకరించామని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ,డిప్యూటీ తహసీల్దార్ గోపాల్, ఆర్ఐ సుహాసిని, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించాలి: తిమ్మాయిపల్లి గ్రామ ప్రజల సౌకర్యాలకు ప్రభుత్వ భూమికి హద్దులు నిర్ణయించి గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాలని భూ భారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ చంద్రశేఖర్ కు గ్రామస్తులు వినతిపత్రమందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -