- Advertisement -
సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జాడి గంగాధర్
నవతెలంగాణ – జన్నారం
కవ్వాల్ టైగర్ జోన్ పేరిట జన్నారం మండల కేంద్రానికి వచ్చే భారీ వాహనాల రాకపోకలపై అటవీశాఖ అధికారులు నిషేధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని, భారీ వాహనాలకు అనుమతులు ఇవ్వాలని జన్నారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు జాడి గంగాధర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరావాదిక దీక్ష చేస్తున్న వారికి మద్దతు పలికారు. వాహనాలు అనుమతించాలని కోరారు కార్యక్రమంలో, జన్నారం సర్పంచ్ గంగాధర్ గౌడ్, గోపాల్ రెడ్డి, పేరం శ్రీనివాస్ రాజన్న, సంతోష్ నాయక్, భూమాచారి బద్రీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -