Monday, June 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. 

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నవంగర గ్రామానికి చెందిన జలగం మల్లయ్య (50) అదే గ్రామానికి చెందిన వల్లపు అశోక్ ఇరువురు కలిసి మే 31 న తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామానికి తమ వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామ శివారులో తెగిపడిన 11 కేవీ విద్యుత్ వైర్లను చూసుకోకుండా వెళ్లడంతో కింద పడ్డారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదే రోజునే వల్లపు అశోక్ మృతి చెందారు. అప్పటి నుండి మల్లయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. మృతుడికి భార్య సాయి మల్లమ్మ, కూతురు చిన్ను ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -