పల్లె దావఖాన వైద్యాధికారి సబితా
నవతెలంగాణ – పెద్దవంగర : గ్రామాల్లో ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అవుతాపురం పల్లె దావఖాన వైద్యాధికారి సబిత అన్నారు. గురువారం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారికి హ్యాండ్ వాష్, సీజనల్ వ్యాధులు పై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కళాధర్ తో కలిసి మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తో పాటుగా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు మన నివాస ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉండడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుందని అన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోత్స్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిరంజీవి, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
- Advertisement -
- Advertisement -