నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకాన్ని నిర్వహిస్తున్న తీరును నిరసిస్తూ కలెక్టర్ కి డిమాండ్ తో కూడా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల, ఉపాధి కూలీల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని, మతోన్మాద జపం చేస్తున్న వీళ్లు మేజర్ గా హిందువులుగా ఉన్న ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్నారు. ఉపాది రంగానికి పోయిన సంవత్సరం 90 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రతి సంవత్సరానికి పెంచాల్సిన దానికి బదులుగా ఈ సంవత్సరం 86 వేల కోట్లకు కుదించారు బడ్జెట్లో ఇది ఏ నీతి అని అడుగుతున్నాం. అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా పేద కూలీలు పెరిగిపోతున్నారు, పట్టణ ప్రాంతాలకు చుట్టుముట్టున్న గ్రామాలని నగరాలలో, పట్టణాలలో విలీనం చేసిండ్రు. గ్రామాలలో ఉపాధి పని చేసేవారు కాబట్టి, వాళ్ళందరూ కూడా వ్యవసాయ మీద ఆధారపడినటువంటి వాళ్ళు, కూలి మీద ఆధారపడ్డవారు కాబట్టి వాళ్లకు పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం చర్య తీసుకొని జాబ్ కార్డు లేని వారందరికీ జాబ్ కార్డు ఇవ్వాలని, ప్రతి ఉపాధి జంటకు పనిచేసే అన్ని రకాల పనిముట్లు ఇవ్వాలని, పరిక్షేత్రాలలో చట్టప్రకారం కనీస సౌకర్యాలు అమలు చేస్తూ దూర ప్రాంతానికి వెళ్లి పని చేస్తున్న వాళ్లకు ఆటో చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు కూలి 600 రూపాయలు, 200 దినాలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. అంతేకాదు ఉపాధి హామీ పథకం సక్రమంగా నడవాలంటే సంవత్సరానికి 2 లక్షల 50వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని, ఇప్పటికైనా ఎక్స్టెండ్ చేయాలని పెద్ది వెంకట్రాములు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు మొత్తం ఉపాధి కూలీలకు అమలు చేయాలి. ఇందిరమ్మ ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఐదు లక్షలు కలిపి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అలాగే పని క్షేత్రాలలో ప్రమాదానికి గురైన వాళ్లకు ఉచిత వైద్యం అందిస్తూ మరణానికి గురైన వాళ్లకు 10 లక్షలు నష్టపరిహారం ఇస్తూ ఉన్నవారికి నిరుద్యోగ భృతి కూడా కేటాయించాలని సంఘం డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో కూలీల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫలితంగా భవిష్యత్తులో అత్యధిక సంఖ్యలో ఉన్న వీళ్ళతో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు గోళం లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర శంకర్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రకాంత్, నాయకులు శేఖర్ గౌడ్, కుమారులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని నిర్వహిస్తున్న తీరును నిరసిస్తూ కలెక్టర్ కి వినతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES