- Advertisement -
నవతెలంగాణ- ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో సోమవారం నాగర్ కర్నూలు జిల్లాలో కీర్తన రజక కుటుంబం పై దాడి చేసి అమానుషంగా 2 నెలల పసికందును హతమార్చిన అగ్రకులస్తులను, వెంటనే అరెస్టు చేయాలని, ఆలేరు పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహషిల్దారు వి ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డేమాన్ నరేందర్, ఆలేటి అనీలు, ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అజయ్, ఆలేటి సంతోష్, బాలకిషన్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



