Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఏటీసీల్లో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులు

ఏటీసీల్లో ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులు

- Advertisement -

పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీలు
మూడు దశల్లో 111 సెంటర్ల అభివృద్ధి
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరిక

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ కోర్సులతో పాటు ఆధునిక శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ రైజింగ్‌-2047కు అనుగుణంగా ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కోర్సులు, పనుల పురోగతిపై సీఎం ఈ సందర్భంగా వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్టు సీఎంకు అధిóకారులు వివరించారు. ఫేజ్‌-1లో 25, ఫేజ్‌-2లో 40, ఫేజ్‌-3లో 46 ఏటీసీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. నిర్దేశిత సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం వారికి సూచించారు. సకాలంలో ఏటీసీలను పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోలన్నారు. జీనోమ్‌ వ్యాలీలో ఒక మోడల్‌ ఏటీసీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులను ఏటీసీల్లో నిర్వహించాలన్నారు. దానికి అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. ఏటీసీల పనుల పురోగతిపై తాను ఆకస్మిక తనిఖీ చేస్తాననీ, తప్పలు దొర్లితే చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -