Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీహెచ్డీ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

పీహెచ్డీ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల

- Advertisement -

నవతెలంగాణ – ఓయూ:  పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం విడుదల చేశారు. ఓయూలో కేటగిరి 2 ద్వారా పీహెచ్డీ ల్లో ప్రవేశాలకు గాను ఏప్రిల్ 25 నుంచి 27 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కంప్యూటర్ ఆధారిత ప్రవేశపరీక్ష నిర్వహించింది. 49 విభాగాల్లో ప్రవేశాలు పొందేందుకు 9వేల 747 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 7వేల 907 మంది పరీక్షలకు హాజరు కాగా… 62.60 శాతం ఉత్తీర్ణతతో 4వేల 950 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అత్యధికంగా ఆంగ్లం నుంచి అతి తక్కువగా పర్షియన్, కన్నడ, ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ విభాగాల్లో విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాశారు. విభాగాల వారీగా విద్యార్థుల ర్యాంకు కార్డులు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఈ నెల 23 నుంచి పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ మొలుగరం తెలిపారు. పూర్తి వివరాలకు www.osmania.ac.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫలితాలు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య నరేష్ రెడ్డి, ఓఎస్డీ ఆచార్య జితెందర్ కుమార్ నాయక్, అడ్మిషన్స్ సంచాలకులు ప్రొఫెసర్ పాండురంగారెడ్డి, అడ్మిషన్స్ సంయుక్త సంచాలకులు ప్రొఫెసర్ జలపతి, డాక్టర్ అక్తర్ అలీ, డాక్టర్ కిషోర్ కుమార్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -