అమరావతి : చిన్న, మధ్యతరహా వ్యాపారుల కోసం దేశంలోనే తొలి వాయిస్ ఆధారిత అకౌంటింగ్ ఎఐ ఏజెంట్ ‘పిల్లొ ఏఐ’ను ఏపీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం స్వయంగా వాయిస్ కమాండ్ ద్వారా తొలి ఇన్వాయిస్ను రూపొందించి, ఏఐ సాంకేతికతతో వ్యాపార నిర్వహణ ఎంత సులభమో ప్రదర్శించారు. సాంకేతికతతో సామాన్యుడి పని సులభతరం కావాలని.. పిల్లొ ఏఐ వంటి సాధనాలు చిన్న వ్యాపారాల్లో పారదర్శకతను పెంచుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత బలోపేతం చేస్తాయని సీఎం పేర్కొన్నారు. చిన్న వ్యాపారుల్లో అకౌంటింగ్ పట్ల ఉన్న భయాన్ని తొలగించి, వారిని డిజిటల్గా శక్తివంతులను చేయడమే తమ లక్ష్యమని పిల్లో ఏఐ సంస్థ వ్యవస్థాపకులు సాయి ప్రణీత్, రామ్ మోహన్ పేర్కొన్నారు.
పిల్లో ఏఐ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



