- Advertisement -
నవతెలంగాణ – మణుగూరు
రైల్వే సహాయక మంత్రి, ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమ శాఖల సహాయక మంత్రి రవనిత్ సింగ్ బిట్టు ని పిన్నపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తో మంత్రిని కలిశారు. రైల్వే సహాయక మంత్రి, ఆహార ప్రాసెసింగ్, పరిశ్రమ శాఖల సహాయక మంత్రి రవనిత్ సింగ్ బిట్టు నికలిసి కూనవరం లో రైల్వే స్టేషన్ నూతన నిర్మాణం మరియు స్టేషన్ అభివృద్ధి, కొత్తగూడెం నుండి అదనపు రైల్వే లైన్లు, గతంలో మాదిరిగా మణుగూరు నుండి 4 ట్రైన్ సర్వీస్ లు పునరుద్దించాలని వినతి పత్రం అందజేశామని పాయ వెంకటేశ్వర్లు తెలిపారు.
- Advertisement -