- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలోని బారామతిలో జరిగిన విమాన ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక సాక్షి ఆ భయానక క్షణాలను వివరించారు. “విమానం ల్యాండ్ అవుతున్న తీరు చూస్తేనే అది కూలిపోతుందేమో అన్న భయం కలిగింది. అనుకున్నట్లుగానే ఒక్కసారిగా రన్వే సమీపంలో కూలిపోయి భారీ పేలుడు సంభవించింది. మేమంతా వెంటనే అక్కడికి పరుగెత్తాం. కాపాడేందుకు వెళ్ళేలోపే విమానంలో మరో 4-5 సార్లు పేలుళ్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ను కోల్పోవడం బాధాకరమని అన్నారు.
- Advertisement -



