- Advertisement -
-ఉద్యాన అధికారిని కందుకూరి స్వాతి
నవతెలంగాణ – రాయికల్
జగిత్యాల నియోజకవర్గ ఉద్యాన అధికారిని కందుకూరి స్వాతి రాయికల్ మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటలను పరిశీలించారు. పిందె కట్టే దశలో తోటలకు సరిపడా నీరు అందించాలని, రసం పీల్చు పురుగుల నివారణకు ఇమిడాక్లోప్రిడ్, తయోమెథక్సిమ్ లేదా వేపనూనె స్ప్రే చేయాలని సూచించారు. బూడిద తెగులుకు హేగ్జాకోనాజోల్, పిందె రాలకుండా ప్లానోఫిక్స్, కాయ సైజు పెరుగుదలకు 13-0-45 స్ప్రే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి రాజేష్, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -



