ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : నర్సరీలో నిర్దేశించిన లక్ష్యం మేరకు వివిధ రకాల మొక్కలను సిద్ధం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో నాటేందుకు నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీలో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. గతంలో వన మహోత్సవంలో నాటిన మొక్కలు చనిపోయిన, ఎండిపోయిన వాటి ప్రదేశంలో కొత్త మొక్కలను నాటించాలని ఈజిఎస్ సిబ్బందికి సూచించారు. నర్సరీలో మొక్కల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. ఉదయం సాయంత్రం వేళల్లో మొక్కలకు నీటిని అందించాలన్నారు. నాటిన మొక్కల్లో 60 శాతం పైగా మొక్కలు బతికేలా తగిన చర్యలు చేపట్టాలన్నారు. నర్సరీ నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసయ్య, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నర్సరీలో లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES