Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమాజీ సర్పంచులపెండింగ్‌ బిల్లులు ఇప్పించండి

మాజీ సర్పంచులపెండింగ్‌ బిల్లులు ఇప్పించండి

- Advertisement -

– కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మాజీ సర్పంచులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు విడుదల చేసేలా రేవంత్‌రెడ్డి సర్కారును ఆదేశించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్యగౌడ్‌, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య విన్నవించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆమెకు వినతిపత్రాన్ని అందజేశారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలు అందజేసినా స్పందన కరువైందని వాపోయారు. మరోవైపు అప్పుల బాధలతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను విడుదల చేయించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -