- Advertisement -
– 21 వ వార్డు అభ్యర్థి గుండెబోయిన ప్రియాంక సురేష్ యాదవ్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : నన్ను ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తానంటూ 21 వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుండెబోయిన ప్రియాంక సురేష్ యాదవ్ సోమవారం వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వార్డుకు సంబంధించి మౌలిక వస్తువులను కల్పించనున్నట్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎన్నికల ముందు కొందరు వ్యక్తులు హడావిడి చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గెలిచిన ఓడిన ఇక్కడే ఉండి మీకు సేవ చేసే వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -



