నవతెలంగాణ-హైదరాబాద్: శివసేన ఎంపీ(UBT) సంజయ్ రౌత్ ప్రధాని మోదీపై మండిపడ్డారు. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్పై బీజేపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని, భారత్ బలగాలకు దక్కాల్సిన క్రెడిట్..ప్రధాని మోడీ రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ప్రధాని.. భారత్ జవాన్ల త్యాగాలను, ధైర్యసాహసాలను ప్రజలకు తెలియజేకుండా..ఆపరేషన్ సిందూర్ పై క్రెడిట్ తన ఖాతాలోకి వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పాక్ శిబిరాలపై దాడికి నేతృత్వం వహించిన మహిళ కమాండర్లను కూడా బీజేపీ నేతలు అవమానించారని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు పహల్గాం దాడిపై, ఆపరేషన్ సిందూర్ఫై చర్చిండానికి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా..స్పందనలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో మోడీ ప్రభుత్వం నియంతల వ్యవహరిస్తుందన్నారు. రక్షణ మంత్రి ఆధ్వర్యంలో పేరుకే రెండు సమావేశాలు నిర్వహించారని, ఆ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని సంజయ్ రౌత్ ఆరోపించారు.
ఆపరేషన్ సిందూర్పై ప్రధాని రాజకీయ ప్రచారాలు: ఎంపీ సంజయ్ రౌత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES