నవతెలంగాణ-రాయికల్
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్,గంజాయి నిర్మూలన, షీటీమ్ సేవలు, మానవ అక్రమ రవాణా, సైబర్ మోసాల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని, నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని కళాబృందం సభ్యులు పాటల ద్వారా వివరించారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీపతి రాఘవులు, పోలీస్ సిబ్బంది పూజిత, కమల్, రమేష్, సత్తన్న, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



