- Advertisement -
నవతెలంగాణ-రాయికల్
మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్, ఇటిక్యాలలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు,డ్రగ్స్ నిర్మూలన,ట్రాఫిక్ నియమాలు,మూఢ నమ్మకాలు,ఆధునిక చట్టాలపై పాటల ద్వారా విద్యార్థులకు చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సి.హెచ్ సుధీర్ రావు,ఏ ఎస్సై దేవేందర్, ప్రిన్సిపల్ కొల్లూరి సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



