- Advertisement -
నవతెలంగాణ – మెండోర
ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సిట్ విచారణ నేపథ్యంలో కెటిఆర్ పిలుపు మేరకు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పోచంపాడ్ ఎక్స్ రోడ్డు వద్ద బిఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టి సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఎస్సై సుహాసిని నేతృత్వంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
- Advertisement -



