- Advertisement -
ముగ్గురు అరెస్టు, నగదు స్వాధీనం
నవతెలంగాణ – రామారెడ్డి
నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మండలంలోని పోసానిపేట్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, వారి నుండి రు. 19920 స్వాధీనం చేసుకొని, ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, ఎవరైనా పేకాట ఆడిన సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోపికంగా ఉంచుతామని తెలిపారు.
- Advertisement -