- Advertisement -
- పాఠశాల ఆట స్థలం రక్షణకు గ్రామసభలో డిమాండ్
- నవతెలంగాణ – రాయికల్
- మండలంలోని చెర్లకొండాపూర్ గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో సర్వే నంబర్ 1400లోని సుమారు 2 ఎకరాల 23 గుంటల పోరంబోకు భూమి వినియోగంపై చర్చించారు. గ్రామ అవసరాల కోసం ఆ భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన గుట్ట భూమి ఆక్రమణకు గురవుతున్నందున, సంబంధిత భూమికి హద్దులు ఏర్పాటు చేసి రక్షించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
- Advertisement -



