నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇంటింటికీ తపాలా పథకాలు అందుబాటు రావాలనేది ప్రభుత్వ లక్ష్యం అని మణుగూరు ఎస్డీఐపీ చింతల రామ్మూర్తి అన్నారు అశ్వారావుపేట ఉప తపాలా కార్యాలయంలో ఎస్పీఎం సాయి అధ్యక్షతన సోమవారం డీసీడీపీ(డాక్ కమ్యూనిటీ ప్రోగ్రాం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్మూర్తి మాట్లాడుతూ మారుతున్న ఆధునిక పరిస్థితుల్లో తపాలా కార్యాలయాలు గ్రామాల్లో మినీ బ్యాంకులు గా మారి ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తపాలా శాఖ లో రాబోవు కాలంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు రానున్నాయని పేర్కొన్నారు.జిల్లాలో గడచిన మూడేళ్ల కాలంలో 225 బ్రాంచి తపాలా కార్యాలయాలు ప్రారంభం అయ్యాయని అన్నారు.ఎంతోమంది యువతకు ఉద్యోగావకాశాలు దక్కాయన్నారు. తపాలా శాఖ అందిస్తోన్న పథకాలను గురించి వివరించారు. కార్యక్రమంలో మెయిల్ ఓవర్సీస్ దుర్గా ప్రసాద్ పలువురు బ్రాంచి పోస్టు మాస్టర్లు, ఏబీపీఎం లు పాల్గొన్నారు.
మినీ బ్యాంకులు గా తపాలా కార్యాలయాలు: ఎస్డీఐపీ రామ్మూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES