Saturday, June 28, 2025
E-PAPER
Homeఆటలుప్రాక్టీస్‌ మొదలైంది

ప్రాక్టీస్‌ మొదలైంది

- Advertisement -

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్‌సేన సాధన
బర్మింగ్‌హామ్‌ :
తొలి టెస్టులో ఓటమి అనంతరం బర్మింగ్‌హామ్‌లో ఓ రోజు సరదాగా గడిపిన టీమ్‌ ఇండియా క్రికెటర్లు శుక్రవారం సాధన షురూ చేశారు. జులై 2 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుండగా.. జట్టులోని సభ్యులు అందరూ తొలి ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరయ్యారు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్‌ కృష్ణ గ్రౌండ్‌లో కనిపించినా.. బౌలింగ్‌ ప్రాక్టీస్‌, ఇతర డ్రిల్స్‌కు దూరంగా ఉన్నారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌లు నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధన చేశారు. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రాక్టీస్‌ సెషన్లో బ్యాటింగ్‌ నైపుణ్యంపై దృష్టి సారించాడు. యువ పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, ఆకాశ్‌ దీప్‌లతో చీఫ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ ప్రత్యేకంగా మాట్లాడుతూ కనిపించాడు. ఐదు రోజుల ప్రాక్టీస్‌, పిచ్‌ స్వభావం పరిగణలోకి తీసుకుని రెండో టెస్టుకు తుది జట్టును ఎంచుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -