ప్రజాగొంతుక.. నవతెలంగాణ

– నవతెలంగాణ 2024 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంపీపీ మల్హర్ రావు
నవతెలంగాణ మల్హర్ రావు: ప్రజాసమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకపోతూ, నవతెలంగాణ దినపత్రిక, ప్రజా గొంతుకగా నిలుస్తోందని మండల ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్ల మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో నవ తెలంగాణ 2024 నూతవ సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల ఎంపిటిసి-2 సభ్యురాలు రావుల కల్పన మొగిలి, తాడిచెర్ల పిఏసిఎస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇప్ప మొండయ్య, ఉపాదిహామీ పథకం ఎపిఓ హరీష్,మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్ ఆదిత్య చక్రవర్తి, ఆపరేటర్ మహేష్, తాడిచెర్ల పంచాయతీ కార్యదర్శి శేఖర్, కాంగ్రెస్ నాయకుడు బూడిద రాజా సమ్మయ్య, ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love