- Advertisement -
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి : వచ్చే సోమవారం ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 2 నాటి (సోమవారం) ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా దరఖాస్తులు సమర్పించ దలచిన వారు కలెక్టరేట్ లోని రూమ్ నెంబర్ 25 లో సమర్పించవచ్చని తెలిపారు. జూన్ 9 జరిగే ప్రజావాణి కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
- Advertisement -