Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఆర్సీని వెంటనే ప్రకటించాలి..

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి..

- Advertisement -

పెండింగ్ డిఏలను, బిల్లులను చెల్లించాలి
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ డిమాండ్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పిఆర్సి ని ప్రకటించి, పెండింగ్ లో ఉన్న డి.ఏ . లను బిల్లులను తక్షణమే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF ) రాష్ట్ర కార్యదర్శి డి. సత్యానంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక మల్లు స్వరాజ్యం ట్రస్టు కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పిఆర్సి ని ప్రకటించి పెండింగ్ డి.ఏ . లను, బిల్లులను చెల్లించాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటును పూర్తిగా నిలిపివేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడిని, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను పునరుద్దరించాలని, 317 బాధితులందరినీ వారి స్థానికత ఆధారంగా సొంత జిల్లాలకు కేటాయించాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, విద్యారంగానికి బడ్జెట్ ను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు 15శాతం నిధులు కేటాయించాలని, మోడల్ స్కూల్, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని, కేజీబీవీ, యుఆర్ఎస్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, అన్ని కేటగిరిల పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేయాలనీ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రతి నెల ఒకటో తేదీన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు.విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం ఇంకా తన తాత్సారాన్ని ఇలాగే కొనసాగిస్తే టీఎస్ యుటిఎఫ్ పక్షాన పోరాటాలకు సిద్దపడుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఉపాధ్యక్షులు, మల్లేష్, ట్రెజరర్ రాజారామ్, జిల్లా కార్యదర్శులు జనార్దన్, సాయన్న, బాబులు, శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు రఘు, రాజేశ్వర్, ప్రభాకర్, లింగం, బాలరాజు, లింబగిరి స్వామి, రవీందర్, భూమేశ్వర్, బాజన్న, సుధాకర్ శ్యామ్ రావ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -