Monday, June 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డయేరియా పట్ల జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

డయేరియా పట్ల జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భూపాలపల్లి : డయేరియా (అతిసార)వ్యాధి  బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా 2025 క్యాంపెయిన్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0-5 సంవత్సరాల చిన్నారులు ఈ అతిసార వ్యాధి బారిన పడే అవకాశం ఉందని, వారి విషయంలో  ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అంగన్ వాడి కేంద్రాలు,  పాఠశాలల్లో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

పరిసరాలు పరిశుభ్రత, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని, క్రమం తప్పక చేతులు పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. సురక్షిత మంచినీరు తీసుకోవాలని సూచించారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డయేరియా ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. డయేరియా నివారణ చర్యల్లో శుద్ధినీటి సరఫరా, హైజిన్ మెరుగుదల, ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక ఫోకస్ చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశా సూపర్వైజర్లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్  ఆదేశించారు.  ఈ క్యాంపెయిన్ ద్వారా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులలో డయేరియా కేసులు పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ముఖ్యంగా 5 సంవత్సరాలు వయస్సున్న పిల్లల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పారిశుధ్యం, వ్యక్తి గత పరిశుభ్రతతో పాటు తరచూ చేతులను సబ్బుతో కడగాలని సూచించారు. నిల్వ ఉంచిన ఆహారాలు తినొద్దని, పరిశుభ్రమైన మంచినీరు త్రాగాలని తెలిపారు.  డయేరియా వ్యాది సోకితే తక్షణమే వైద్యుల ను సంప్రదించి వైద్య సేవలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో  అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, బిసి సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్,  ఆర్డిఓ రవి,  వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి ,ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -