Thursday, July 31, 2025
E-PAPER
Homeజిల్లాలుగర్భిణీలు ప్రభుత్వ టీకాలను వినియోగించుకోవాలి: కలెక్టర్

గర్భిణీలు ప్రభుత్వ టీకాలను వినియోగించుకోవాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న  మందులను, టీకాలను  వినియోగించుకుంటూ, సమయానికి మంచి ఆహారాన్ని తీసుకుంటే పుట్టబోయే బిడ్డ , తల్లి బలంగా ఉంటారని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం మోత్కూరు మండలం కేంద్రంలో గర్భిణి మహిళ గంధం సమ్మక్క  కు  జిల్లా కలెక్టర్ అమ్మకు భరోసా కిట్ పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గర్భిణీ స్త్రీ  అయిన సమ్మక్క తో ఆప్యాయంగా మాట్లాడి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమయానికి భోజనం చేస్తున్నావా? మందులు వేసుకుంటున్నావా? అంటూ అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో శ్రద్ధ తీసుకోవాలని, సమయానికి ఆహారం తీసుకుంటే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండతాడని తెలిపారు.

వారి కుటుంబ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న, ఈ సమయంలో మానసిక ఒత్తిడులు లేకుండా ఉండాలని సూచించారు. కుటుంబానికి అవసరమైన పోషకాహారాన్ని అందించేందుకు న్యూట్రిషన్ కిట్‌ను వారికీ అందజేశారు. అనంతరం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకోవడం పూర్తి స్థాయిలో ఆరోగ్యకరమైన మరియు అనవసర ఖర్చులు లేకుండా జరుగుతుంది వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సమయంలో తల్లి, బిడ్డకు అవసరమైన మందులు, టీకాలు ఉచితంగా అందించబడతాయని తెలిపారు. ఇంకా, కాన్పు తర్వాత 102 వాహన సేవ ద్వారా తల్లిని బిడ్డతో కలిపి ఇంటి వద్ద దింపే సదుపాయం  ఉందని వివరించారు. 

ఆహార పదార్థాలపై  కలెక్టర్ గర్భిణి స్త్రీ కి అవగాహన కల్పించారు. మెంతికూర, తోటకూర, పుంటికూర వంటి ఆకుకూరలను పప్పుతో కలిపి వారానికి కనీసం రెండు సార్లు తినాలని చెప్పారు. అలాగే గ్లాస్ పాలు, కొబ్బరి ముక్కలు (ఎండినవి లేదా తాజా), పల్లీలు బెల్లంతో కలిపి, ఖర్జూరాలు, డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని సూచించారు. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచన మేరకు ఐరన్ ట్యాబ్లెట్స్ లేదా ఇంజక్షన్ రూపంలో తీసుకోవడం సూచించారు. ఈ రకమైన ఆహారం ద్వారా గర్భిణికి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉంటుంది. అలాగే కాన్పు అయిన తర్వాత ఒక గంటలోపు ముర్రు పాలను తప్పకుండా ఇవ్వాలనే అంశంపై కూడా గర్భిణికి అవగాహన కల్పించారు. 

ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకి సూచించారు. తద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందడంతో పాటు తల్లి బిడ్డల ఆరోగ్యం పదిలంగా తెలియచేసారు. అదేవిదంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు తరచూ గర్భిణుల ఇండ్లను సందర్శించి గర్భిణి స్త్రీల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వారికీ తగిన సలహాలు మరియు సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్య శాఖ అధికారి మనోహర్, సంబంధిత అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -