- Advertisement -
– ప్రజలకు అందుబాటులో వైశ్య బ్యాంక్
– జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు
నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరూర్ వైశ్య బ్యాంకు బ్రాంచ్ ను కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు పప్పుల రాజేంద్ర ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ బ్యాంకు నిజాంసాగర్ ఎక్స్ రోడ్లో ఉండేదని ప్రస్తుతం ఖాతాదారులకు అందుబాటులో ఉండేందుకు మున్సిపల్ కార్యాలయం ముందుకు మార్చడం జరిగిందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేనేజర్ రవీందర్, గౌరీశెట్టి లక్ష్మి రాజం, గౌరీశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



