నవతెలంగాణ – హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 21న ఆమె స్వామివారి సేవలో పాల్గొంటారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె తిరుపతికి రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల 20న రాష్ట్రపతి ముందుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటారు. మరుసటి రోజు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి మొదట శ్రీ వరాహస్వామి వారిని, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Droupadi Murmu: నవంబర్ 21న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ర్టపతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


