విద్యాశాఖ సెక్రెటరీ డాక్టర్ యోగితారాణా ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట సరకుల ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రెటరీ డాక్టర్ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పీఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజనం వంట ధరలను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపు రాష్ట్రంలోనూ వంట ఏజెన్సీ మహిళలు 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున చెల్లిస్తుండగా దాన్ని రూ.6.19కి పెంచారు. 6 నుంచి 8 తరగతుల పిల్లలకు రూ.8.17 చెల్లిస్తుండగా దాన్ని రూ.9.29కు పెంచారు. 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.10.67 నుంచి రూ.11.79కి పెంచారు. ఈ ధరలు గుడ్డును మినహాయించి మిగిలిన వంట సరుకులకిచ్చేవి. కొత్త ధరలు 2024 డిసెంబరు 1వ తేదీ నుంచి వర్తించనున్నది. ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వెచ్చిస్తున్న విషయం విధితమే.
మధ్యాహ్న భోజన వంట సరుకుల ధరలు పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



