- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈసారి తొలిసారిగా ‘వందేమాతరం’ గేయాన్ని ఆలపించనున్నారు. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధన థీమ్తో జరుగుతున్న ఈ వేడుకల్లో స్వదేశీ తుపాకులతో 21 ఫిరంగుల వందనం, వైమానిక దళ హెలికాప్టర్ల పూల వర్షం, ఎన్సీసీ క్యాడెట్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
- Advertisement -



