నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు. ఆగస్టు 25న ఖోడల్ధామ్ మైదానంలో మోడీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నికోల్లో రోడ్లను మూసివేసి దారి మళ్లించారు.
ఇక పర్యటనలో భాగంగా గుజరాత్లో రూ.1,400 కోట్ల విలువైన రైల్వే అప్గ్రేడ్లు, రూ.1,000 కోట్ల విలువైన విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులు, రోడ్డు కనెక్టివిటీ చొరవలు, మురికివాడల పునరాభివృద్ధి, గాంధీనగర్లో రాష్ట్ర స్థాయి డేటా సెంటర్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మోడీ ప్రారంభించనున్నారు.