Saturday, June 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ప్రధాని సమీక్ష

అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ప్రధాని సమీక్ష

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఆ త‌ర్వాత అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటన ఊహించని పెను విషాదమని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల బాధ భరించరానిదని అన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను కోల్పోయిన వారి బాధను తాను అర్థం చేసుకోగలనని మోడీ అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్‌బెల్‌ విల్సన్ కూడా పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్‌ హైకమిషన్‌ అధికారులు నేడు అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. ఘటన స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతదేహాల కోసం శిథిలాల కింద జాగిలాలతో గాలిస్తున్నారు.

ఈ విమాన ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 265 మంది చనిపోగా.. చాలా మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విమానంలో మొత్తం 241 మంది చనిపోయారు. రమేశ్ విశ్వాస్ కుమార్ అనే 11ఏ సీటు పొందిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మృతి చెందారు. విమానం బీజై మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కూలడంతో లంచ్ చేస్తున్న విద్యార్థులు 20 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిషర్లు, మిగతా వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారు. ప్రాణాలతో బయటపడ్డ రమేశ్ విశ్వాస్ కుమార్ తాను విమానంలో నుంచి దూకలేదని విమానం కూలిన సమయంలో బ్లాస్టింగ్ దాటికి తన సీటు ఎగిరి పక్కకు వెళ్లిపోయిందని.. శిథిలాల కింద చిక్కుకోవడంతో వేడి మంటల నుంచి తప్పించుకోగలిగినట్లు వైద్యులతో తెలిపాడు.‍

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -