నవతెలంగాణ – నెల్లికుదురు
69ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారుల విద్యార్థులకు బహుమతులను సర్టిఫికెట్లను అందజేసినట్లు ఎంఈఓ ఆంగోతు రామదాసు జిల్లా ఎస్టి ఎఫ్ఐ సెక్రటరీ గండి సత్యనారాయణ జిల్లా యోజన క్రీడల అధికారి జ్యోతి జోనల్ సెక్రటరీ ఎండిమామ్ మల్లయ్య తెలిపారు. మంగళవారం సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఐలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్చరీ క్రీడలు ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ రాష్ట్రస్థాయిలో ఏం పీకా కాబడిన క్రీడాకారులు జాతీయస్థాయిలో నిర్వహించబడే మణిపూర్లో పాల్గొంటారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకొని ఓడిపోయిన క్రీడాకారుడు ముందుకు సాగాలని అన్నారు. క్రీడల్లో ఓటమి గెలుపులు సహజమని ఎవరు కూడా నిరోత్సవా పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు ప్రణయ్ ప్రభాకర్ రవి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అర్చరీ క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం
- Advertisement -
- Advertisement -



