Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

హాస్పిటల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే నియమించాలి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
: సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్ అనేక రకాల సమస్యలకు నిలయం అయిందని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ సూర్యాపేట డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పటల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ.. హాస్పిటల్ కు వచ్చిన రోగులకు అన్ని రకాల మందులు లభించడం లేదని, చాలా రకాల మందులు బయట మెడికల్ షాప్ లలో కొనుక్కోవాల్సి వస్తుందని, బయటి మెడికల్ షాపులలో ఉన్న రేట్లకు నిరుపేదలు కొనుగోలు చేయలేక అనేక రకాల అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన చెందారు.

అదేవిధంగా స్కానింగ్ చేసుకున్న రోగులను రిపోర్టుల కొరకు రోజుల తరబడి హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఈసీజీ చేసే టెక్నీషియన్ లేకపోవడంతో అక్కడ ఉన్న వార్డ్ బాయ్ లతో ఈసీజీ చేస్తున్నారని, దానితో ఫలితాలు తారుమారుగా వస్తున్నాయని ఆవేదన చెందారు. పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం వలన దోమలు ఈగలు జుబ్బు మంటున్నాయని ఆరోపించారు. మహిళలకు ఇంజక్షన్ చేసే గదిలో ఎలాంటి రక్షణ లేదని అన్నారు. హాస్పటల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అవి ఖాళీగా ఉండటం వలన ఉన్న సిబ్బందిపై అధిక భారం పడటమే కాకుండా, రోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కావున ఈ అన్ని రకాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. లేని ఎడల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించినారు.

ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్,అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పేర్ల నాగయ్య, జిల్లా కమిటీ సభ్యులు అంబటి బిక్షం, పార్టీ పట్టణ కార్యదర్శి గులాం హుస్సేన్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మారసాని చంద్రకళ, జిల్లా కోశాధికారి మోటకట్ల జయమ్మ , పావని,లక్ష్మి, ఐతరాజు పద్మ, కట్టా కల్పన, బీమనపల్లి పద్మ,శ్యామల, నాగేంద్ర, పార్టీ నాయకులు మోహన్,నారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -