- Advertisement -
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్
నవతెలంగాణ -పెద్దవంగర
మండల కేంద్రంలోని నూతన తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఐకేపీ ఆధ్వర్యంలో నేడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని సూచించారు.
- Advertisement -



