- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని ఆయా గ్రామపంచాయతీ లతోపాటు, రామారెడ్డి విశ్వకర్మ సంఘం లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…. తెలంగాణ సిద్ధాంతకర్తగా, తొలి దశ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, యువజన సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -