సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు వినతి
నవతెలంగాణ-కామారెడ్డి
జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, అసైన్డ్ భూములను కబ్జాల నుంచి రక్షించాలని సీపీఐ(ఎం) కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల ప్రభుత్వ, దేవాలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలు చేస్తూ వెంచర్ల ఏర్పాటు చేస్తున్నారన్నారు. బిక్నూర్ సిద్ధ రామేశ్వర ఆలయానికి సంబం ధించిన వెయ్యి ఎకరాల భూమి మాచారెడ్డి చౌరస్తా వెంకటేశ్వర ఆలయం భూములు, నగర రామయ్య భూములు, జంగంపల్లిలోని 1200 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురైందని, వాటిని రక్షించాలని మంత్రిని కోరారు. జిల్లాలో చెరువులు, కుంటలు కబ్జాలు చేస్తున్నా.. జిల్లా అధికార యంత్రాం గం చూసిచూడనట్టు ఉంటుందని విమర్శించారు. కామారెడ్డిలో అశోక్ నగర్, పాతరాజంపేట్ దగ్గర రైల్వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని, ఆటో నగర్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని తెలిపారు. మధ్యలో ఆగిన సమీకృత మాంసం మార్కెట్, కూరగాయల మార్కెట్ని పున: ప్రారంభించి త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరామ్ నాయక్, కొత్త నరసింహులు, జిల్లా కమిటీ సభ్యులు ముదాం అరుణ్ పాల్గొన్నారు.
దేవాలయ అసైన్డ్ భూములను రక్షించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES